Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ ఫలితాలతో దిమ్మతిరిగిపోతుంది : హార్దిక్ పటేల్

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిమ్మతిరిగిపోయేలా ఉంటాయని పటీదార్ అనామత్ ఆందోళన్ నాయకుడు హార్దిక్ పటేల్ జోస్యం చెప్పారు.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (15:32 IST)
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిమ్మతిరిగిపోయేలా ఉంటాయని పటీదార్ అనామత్ ఆందోళన్ నాయకుడు హార్దిక్ పటేల్ జోస్యం చెప్పారు. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగింది.
 
ఈ ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును అహ్మదాబాద్‌లో వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గుజరాత్ ఎన్నికల ఫలితాలు దిమ్మదిరిగేలా ఉంటాయన్నారు. గుజరాత్ ఓటర్లు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పనున్నారని, తమ అంచనాలకు తగినట్టుగానే ఫలితాలు ఉంటాయన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ సారధ్యంలోని పటీదార్ ఆందోళన్ సమితి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుండగా, వడోదరాలో వడోదరా మహరాజ్ సమర్జీత్ సింగ్ గైక్వాడ్, ఆయన తల్లి రాజమాత శుభాంగినీ దేవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఓటు వేశారు. చోటా ఉదయ్‌పూర్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటింగ్ ప్రక్రియ గంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. ముస్లిం ప్రభావిత ప్రాంతమైన జుహూపురాలో చాలా తక్కువ పోలింగ్ నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments