Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే ఇక ఉరిశిక్షే...

ఉన్నావ్ (యూపీ), కఠువా (జమ్మూకాశ్మీర్) ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇకపై 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదు.

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (09:01 IST)
ఉన్నావ్ (యూపీ), కఠువా (జమ్మూకాశ్మీర్) ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇకపై 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదు. కేంద్ర మంత్రివర్గం శనివారం సమావేశమై ఇందుకు సంబంధించి ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చే అంశాన్ని పరిశీలించి ఖరారు చేస్తుంది. 
 
ఇది వెంటనే జారీ అవుతుందని ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం(పోస్కో)కు సవరణ చేస్తూ తెచ్చే ఈ ఆర్డినెన్స్‌ను తక్షణం అమలు చేయాలని నిర్ణయించారు.
 
ఆర్డినెన్స్‌‌స్థానే తీసుకునిరాబోయే చట్టాన్ని పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఇన్నాళ్లూ మైనర్లను రేప్‌ చేస్తే విధించే కఠిన శిక్ష అత్యధికంగా జీవిత ఖైదు (14 ఏళ్లు)... అత్యల్పంగా ఏడేళ్లు. ఈ నేపథ్యంలో పోస్కో చట్టానికి సవరణ తేనున్నట్లు కేంద్రం శుక్రవారం అధికారికంగా సుప్రీంకోర్టుకు కూడా తెలియజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం