Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే ధ్వంసం కేసులో హార్దిక్ పటేల్‌కు జైలుశిక్ష

గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే రిషికేష్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో పటీదార్ ఉద్యమ యువ నేత హార్దిక్ పటేల్‌కు స్థానిక కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హార్దిక్‌తోపాటు లాల్జ

Webdunia
బుధవారం, 25 జులై 2018 (14:53 IST)
గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే రిషికేష్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో పటీదార్ ఉద్యమ యువ నేత హార్దిక్ పటేల్‌కు స్థానిక కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హార్దిక్‌తోపాటు లాల్జీ పటేల్, ఏకే పటేల్‌కు కూడా ఇదే శిక్షపడింది. రూ.50 వేల జరిమానా కూడా కట్టాలని కోర్టు ఆదేశించింది.
 
గత 2015లో జరిగిన గుజరాత్ పటీదార్ ఉద్యమ సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో విస్ నగర్‌లోని బీజేపీ ఎమ్మెల్యే రుషికేష్ ఆఫీస్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ ఆందోళనలో మూడు వేల మంది పాల్గొన్నారు. 17 మందిపై కుట్ర, దాడి, అల్లర్ల కేసులు నమోదు అయ్యాయి. 
 
ఈ కేసులో అరెస్టు అయిన హార్దిక్ పటేల్.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యారు. అనంతరం కొన్ని నెలలు మెహసానా జిల్లాలోకి ప్రవేశించకుండా కోర్టు కూడా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు తీర్పును వెలువరించగా, ఇందులో హార్దిక్ పటేల్‌కు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
కాగా, ఈ కోర్టు తీర్పుకి ముందే హార్దిక్ పటేల్ తన అనుచరులతో కీలక భేటీ నిర్వహించారు. కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళనలకు దిగొద్దని సూచించారు. అలా వారు ఊహించినట్టుగానే కోర్టు తీర్పు వెలువడటంతో ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments