Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ నుంచి మరికొన్ని మినహాయింపు... కేంద్రం ఉత్తర్వులు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:19 IST)
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది వచ్చే నెల మూడో తేదీవరకు అమల్లోవుండనుంది. అయితే, ఈ నెల 20వ తేదీ నుంచి నాన్ హాట్ స్పాట్ కరోనా ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌డౌన్‌ను సడలించారు. తాజాగా మరికొన్నింటికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చారు. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
 
ఈ ఉత్తర్వుల మేరకు.. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. మున్సిపాలిటీ పట్టణాలలో మాత్రం దుకాణాలు తెరిచేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే, పట్టణ ప్రాంతాలలో నిత్యావసరాలు కాకుండా ఇతర వస్తువులు అమ్మేందుకు జనావాస ప్రాంతాలలో ఉన్న దుకాణాలను తెరచేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. 
 
కానీ, ఈ దుకాణాలలో 50 శాతం సిబ్బంది మాత్రమే పనిచేయాలని.. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఈ అనుమతులు మద్యం దుకాణాలకు వర్తించబోదని తేల్చి చెప్పింది. అదేవిధంగా, 'హాట్ స్పాట్స్', కంటైన్మెంట్ జోన్స్‌కు కూడా ఈ ఉత్తర్వులు వర్తించవని క్లారిటీ ఇచ్చింది. అయితే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే.. తమ రాష్ట్రంలో ఎలాంటి మినహాయింపులు లేవని ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments