Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితను దోషిగా ప్రకటించలేం.. రూ.100కోట్ల జరిమానాగా విధించలేం: సుప్రీం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను అక్రమాస్తుల కేసులో దోషిగా ప్రకటించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అక్రమాస్తుల కేసులో ఇటీవల ఇచ్చిన తీర్పును సవరించాలంటూ.. గత నెలలో కర్ణాటక సర్కారు దాఖ

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (12:07 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను అక్రమాస్తుల కేసులో దోషిగా ప్రకటించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అక్రమాస్తుల కేసులో ఇటీవల ఇచ్చిన తీర్పును సవరించాలంటూ.. గత నెలలో కర్ణాటక సర్కారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం తోసిపుచ్చింది. జయలలితను దోషిగా తేల్చడంతో పాటు రూ.100 కోట్ల జరిమానా విధించాలని కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంను విజ్ఞప్తి చేసింది. 
 
ఇంకా జరిమానాను జయలలిత కూడబెట్టిన ఆస్తులను వేలం వేయడం ద్వారా వసూలు చేయాలని కర్ణాటక విజ్ఞప్తి చేసింది. కానీ ఈ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. ఆమె మరణించిన నేపథ్యంలో జరిమాన విధించడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. అయితే శశికళకు విధించిన జరిమానాను వసూలు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. 
 
కాగా, జయలలిత అక్రమాస్తుల కేసుల విచారణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం రూ.2.79 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని జరిమానా విధించడం ద్వారా రాబట్టుకోవాలని కర్ణాటక విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments