Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృతకు బెదిరింపులు.. చెన్నై నుంచి బెంగళూరుకు..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను తానేనంటూ చెప్తూ.. సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేసిన అమృతకు ప్రాణముప్పు వుందని తమిళనాట ప్రచారం సాగుతోంది. జయలలిత కుమార్తెను తానేనని.. కావాలంటే డీఎ

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (12:40 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను తానేనంటూ చెప్తూ.. సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేసిన అమృతకు ప్రాణముప్పు వుందని తమిళనాట ప్రచారం సాగుతోంది. జయలలిత కుమార్తెను తానేనని.. కావాలంటే డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది అమృత. అయితే సుప్రీం కోర్టు కర్ణాటక హైకోర్టులో ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాల్సిందిగా ఆదేశించింది. అమృత పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
ఈ నేపథ్యంలో అమృతకు బెదిరింపులు వస్తున్నాయని.. దీంతో అమృత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. చెన్నైలో న్యాయవాదులతో చర్చించిన తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయిన అమృత.. ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియట్లేదట. 
 
అయితే అమృత త్వరలోనే కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని సమాచారం. జయలలిత కుమార్తెను తానేనని నిరూపించుకునేందుకు సిద్ధంగా వున్నానని.. అమ్మకు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయాలని.. ఆమె మరణంపై అనుమానాలున్నాయని.. సమగ్ర విచారణకు సైతం డిమాండ్ చేస్తూ అమృత కోర్టు మెట్లెక్కే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments