Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత శరీరంలోకి ఐదున్నర లీటర్ల రసాయనాలు...

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి ఓ మిస్టరీ. ఈ మిస్టరీని ఛేదించేందుకు జస్టీస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ విచారణలో అనేక విషయాలు ఒక్కొక్కటిగా వె

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (09:41 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి ఓ మిస్టరీ. ఈ మిస్టరీని ఛేదించేందుకు జస్టీస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ విచారణలో అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
 
తాజాగా జయలలిత శరీరంలోకి ఐదున్నర లీటర్ల రసాయనాలను ఎక్కించినట్టు మద్రాస్ మెడికల్ కాలేజీ (ఎంఎంసీ) అనాటమీ విభాగం చీఫ్ డాక్టర్ సుధా శేషయ్యన్ వెల్లడించారు. ఈ రసాయనాలను ఎంబ్లామింగ్‌ చికిత్స కోసం ఎక్కించామని తెలిపారు. రసాయనాలను శరీరంలోకి ఎక్కించేందుకు జయలలిత ఎడమ దవడపై రంధ్రాలు చేసినట్టు ఆమె విచారణ కమిటీకి తెలిపారు. జయలలితకు ఉన్న అత్యంత సన్నిహితురాళ్ళలో సుధా శేషయ్యన్ ఒకరు. 
 
ఈమె విచారణ కమిటీకి ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలను పరిశీలిస్తే, "అమ్మ మరణించిన రోజు రాత్రి 10 గంటలకు ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. ప్రజలు సందర్శించే వరకు మృతదేహం చెడిపోకుండా, దుర్వాసన రాకుండా ఎంబ్లామింగ్ చేయడానికి తనను రమ్మన్నారు. తన వైద్య బృందంతో ఆసుపత్రికి చేరుకుని మృతదేహంలోకి రసాయనాలు ఎక్కించేందుకు జయ ఎడమ దవడపై నాలుగు రంధ్రాలు చేసినట్టు వివరించారు. 
 
ఈ రంధ్రాల ద్వారా మిథనాల్ సహా వివిధ రసాయనాలు కలిగిన ఐదున్నర లీటర్ల మిశ్రమాన్ని జయ శరీరంలోకి ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించినట్టు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 75 రోజుల చికిత్స తర్వాత డిసెంబరు 5, 2016న తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments