Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. అమ్మను ఊపిరాడని స్థితిలోనే తీసుకొచ్చారు.. ప్రతాప్ రెడ్డి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. జయలలితను అపోలోకు ఊపిరాడని స్థితిలోనే తీసుకొచ్చారని అపోలో ఆసుపత్రుల వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి తెలిపారు. జయలలిత మరణంపై అనుమానా

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (08:26 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. జయలలితను అపోలోకు ఊపిరాడని స్థితిలోనే తీసుకొచ్చారని అపోలో ఆసుపత్రుల వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి తెలిపారు.

జయలలిత మరణంపై అనుమానాలున్నాయని ప్రజలు, విపక్షాలు చెప్తున్న నేపథ్యంలో.. ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతారెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబరు 12 రాత్రి జయ ఊపిరాడని స్థితిలోనే చేరారని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు చివరికి ఫలితం మాత్రం అందరూ ఊహించినట్టుగా కాకుండా వేరేలా వచ్చిందన్నారు. 
 
కాగా జయలలిత మరణంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతున్న తరుణంలో.. ఇన్నాళ్లు జయలలిత చికిత్స పట్ల ఏవేవో చెప్పుకొచ్చిన అపోలో యాజమాన్యం ప్రస్తుతం నిజాలను వెల్లడించింది. ఇందులో భాగంగా అపోలో గ్రూప్ సంస్థల ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి నోరు విప్పారు. జయలలితను చాలా క్రిటికల్ పొజిషన్‌లో హాస్పిటల్‌కు తీసుకొచ్చారని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు. ఆమెను బతికించేందుకు డాక్టర్లు చాలా ప్రయత్నించారన్నారు. కానీ వ్యాధి తీవ్రత ఎక్కువగా వుండటంతో పరిస్థితి విషమించిందని చెప్పారు. 
 
ప్రజల భావోద్వేగాలను గుర్తుపెట్టుకుని ఆమె ఆరోగ్యం పట్ల నిజాలను బయటికి చెప్పవద్దని ఆదేశాలు రావడంతో వాస్తవాలను బయటికి చెప్పలేకపోయామని తెలిపారు. హై షుగర్ కారణంగానే జయలలిత మరణించారు. 500 పాయింట్స్ షుగర్ పెరగడంతో ప్రాణాలు కోల్పోయారని వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments