Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు తీర్థంలా భావించి తాగిన బీజేపీ కార్యకర్త

అతిభక్తి పనికిరాదంటారు. కానీ, ఈ బీజేపీ కార్యకర్తకు మాత్రం అతిభక్తే ముద్దుగా అనిపిస్తోంది. అందుకే, తమ ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు పరమ పవిత్రమైన తీర్థంగా భావించి సేవించాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగి

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (09:27 IST)
అతిభక్తి పనికిరాదంటారు. కానీ, ఈ బీజేపీ కార్యకర్తకు మాత్రం అతిభక్తే ముద్దుగా అనిపిస్తోంది. అందుకే, తమ ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లు పరమ పవిత్రమైన తీర్థంగా భావించి సేవించాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జార్ఖండ్‌ రాష్ట్రంలోని గొడ్డా సెగ్మెంట్ ఎంపీ నిషికాంత్‌ ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా, కన్హావరా అనే గ్రామానికి వెళ్లారు. ఓ బ్రిడ్జిని నిర్మిస్తానని ప్రకటించిన దూబే ప్రసంగం పూర్తి కాగానే పళ్లెంతో వచ్చిన పవన్‌ అనే బీజేపీ కార్యకర్త ఎంపీ కాళ్లు కడిగాడు. 
 
అంతటితో ఆగక ఆ నీళ్లను తాగేశాడు. ఆ సమయంలో ఎంపీ అతణ్ని వారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ చర్యను ఆ కార్యకర్త సమర్థించుకున్నాడు. ఆయన తమకు అత్యంత ప్రియతమైన నేత అని, అందుకే అలా చేసినట్టు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments