Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లకురిచిలో ఘటన.. హాస్టల్‌ ప్రాంగణంలో బాలిక శవం.. ఏం జరిగింది?

Webdunia
సోమవారం, 18 జులై 2022 (16:18 IST)
Kallakurichi
తమిళనాడులో దారుణ ఘటన జరిగింది. కళ్లకురిచికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నసేలంలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో షాకింగ్ సంఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక జూలై 13న హాస్టల్ ప్రాంగణంలో శవమై కనిపించింది. 
 
కాగా, బాలిక హాస్టల్‌లోని మూడో అంతస్తులోని ఓ గదిలోని బాల్కనీ నుంచి నేలపైకి దూకి తన జీవితాన్ని ముగించుకుందని అనుమానిస్తున్నారు. మరణానికి ముందు ఆమెకు గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అయితే, బాలిక చనిపోవడం వెనుక హాస్టల్ సిబ్బంది ఏవైనా ఉన్నాయా అని బాధిత బాలిక బంధువులు అనుమానించారు.
 
దీంతో.. ఆదివారం గ్రామస్తులతో కలిసి మూకుమ్మడిగా పాఠశాలలో ప్రవేశించి, అక్కడి బస్సులను తగులబెట్టారు. ఆమె మరణంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె తల్లిదండ్రులు, బంధువులు, కడలూరు జిల్లా వేప్పూర్‌లోని పెరియనాసలూరు గ్రామం ప్రజలు న్యాయం చేయాలని కోరుతూ నిరంతరాయంగా నిరసనలు చేస్తున్నారు. 
 
విద్యార్థి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు 'అంతర్జాతీయ' పాఠశాల అధికారులను నిందించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments