Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కమల్‌నాథ్‌కే.. రాజస్థాన్ ఎవరికో?

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (10:30 IST)
సస్పెన్స్‌కు తెరపడింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కమల్‌నాథ్‌ ఎంపికయ్యారు. సీఎం రేసులో చివరివరకు పోటీలో నిలచిన యువనేత జ్యోతిరాదిత్య సింథియాకు చుక్కెదురైంది. అనుభవంతో పాటు యువతరం మధ్య జరిగిన రసవత్తర పోరులో కాంగ్రెస్ అధిష్టానం అనుభవానికే పెద్దపీట వేసింది. 
 
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోసం కమల్‌నాథ్, యువనేత జ్యోతిరాధిత్య సింథియాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గురువారం రోజంతా తీవ్ర తర్జన భర్జనల తర్వాత ఎంపీ సీఎంగా కమల్‌నాథ్ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. 
 
నిజానికి భోపాల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం కల్పించాలన్న అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధిష్టాన పరిశీలకులుగా సీనియర్లు ఏకే ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, శోభా ఓజా తదితరులు పాల్గొన్నారు. 
 
సీఎల్పీ భేటీ తర్వాత కమల్‌నాథ్ పేరును మధ్యప్రదేశ్ సీఎంగా అధికారికంగా ప్రకటించారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం కూడా ఎవరూ ఉండబోరని స్పష్టంచేసింది. మొన్నటి ఎన్నికల్లో చింద్వారా నియోజకవర్గం నుంచి కమల్‌నాథ్ పోటీచేసి గెలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments