Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక ఎన్నికల పోలింగ్.. ఓటేయండి.. వేడి వేడి దోసె, కాఫీ కొట్టండి..

కర్ణాటక ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఎండల కారణంగా పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున క

Webdunia
శనివారం, 12 మే 2018 (12:31 IST)
కర్ణాటక ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఎండల కారణంగా పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున క్యూ కట్టారు. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 
 
ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. అవగాహన కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించింది. అయితే ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఓ హోటల్‌ నిర్వహకుడు వినూత్న పద్ధతిలో ముందుకు వచ్చాడు. నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణ రాజ్‌ బెంగళూరులో ఓటింగ్‌ శాతం పెంచేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలెట్టాడు. 
 
కర్ణాటక పోలింగ్‌లో తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్న యువతకు తన హోటల్‌లో ఉచితంగా దోసె అందిస్తున్నాడు. అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఇతరులకు ఫిల్టర్‌ కాఫీని ఇస్తానని ఆఫర్ చేశాడు. ఈ ఉచిత దోసె, కాఫీని పొందాలంటే ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును హోటల్‌లో చూపించాల్సి ఉంటుంది. ఎవరికైనా ఓటేయండి.. కానీ ఓటు హక్కును వినియోగించుకోండని హోటల్ యజమాని కొత్త ప్రచారాన్ని చేపట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం