Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతిలో బిడ్డతో వెళ్తున్న మహిళ.. వెనుక నుంచి ఎక్కిదిగిన జీపు?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:32 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. కర్ణాటక, పుత్తూరు తాలూకాలోని, సంతలో ఓ మహిళ చేతిలో బిడ్డతో నడిచి వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన జీపు.. తల్లీబిడ్డలపై ఎక్కి దిగింది. వెంటనే ఆ సంతలోని ప్రజలు హుటాహుటిన మహిళను, బిడ్డను కాపాడారు. ఈ ఘటనలో చిన్నపాటి గాయాలతో తల్లీబిడ్డ తప్పించుకున్నారు. 
 
ఈ ఘటనపై పోలీసులు జీపు డ్రైవర్ వద్ద జరిపిన విచారణలో.. జీపును తాళంతో అలానే నిలబెట్టి.. పక్క షాపుకు వెళ్లాడని.. ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు.. జీపు తాళాన్ని మెల్లగా తిప్పేశారు. దీంతో వేగంతో ముందుకు నడిచిన జీపు.. సమీపంలో చేతిలో బిడ్డతో సహా నడిచి వెళ్తున్న మహిళపై ఎక్కి దిగింది. ఆపై ఓ గోడకు ఢీకొని ఆగిపోయింది. 
 
ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చేతిలో బిడ్డతో నడుస్తూ వెళ్తున్న మహిళను వెనకు నుంచి వచ్చిన జీపు ఎక్కి దిగడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా షాకవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments