Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం చేసుకున్నాం.. చంపేస్తామని బెదిరిస్తున్నారు.. అందుకే చనిపోతున్నాం...

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (14:29 IST)
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. కులాలకు వ్యతిరేకంగా వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంటను కుటుంబ సభ్యుల మూర్ఖత్వం కాటేసింది. ఇద్దరూ కలిసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బెంగుళూరులోని గౌరీపాళ్యకు చెందిన రక్షిత (24), శేషాద్రి (27) మూడేళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి ఇద్దరి కుటుంబ సభ్యులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. 
 
నెల క్రితం వారిని ఎదిరించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో నుండి వెళ్లిపోయి విడిగా కాపురం పెట్టారు. అయితే బెంగళూరు విధానసౌధలో కేస్‌ వర్కర్‌గా పని చేస్తున్న గంగాధర్‌ సహాయంతో కుటుంబ సభ్యులు తమను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ నెల 7న జగ్జీవన్‌రామ్‌ నగర ఠాణాలో వీరు ఫిర్యాదు చేశారు. 
 
తమకు ప్రాణహానికి భయపడి ఇద్దరూ నగరం విడిచి చిక్కమగళూరు జిల్లా మూడిగెరెకు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ప్రవర్తనకు కలత చెందిన వారు సోమవారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో, తమ వివాహం గురించి, గంగాధర్‌, కుటుంబ సభ్యుల బెదిరింపుల గురించి చెప్పి, చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారు. ఇదే తమ చివరి వీడియో అని కూడా వీడియోలో చెప్పారు. జేజేనగర ఠాణా పోలీసులు మూడిగెరెకు వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments