Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఇవ్వనున్న కానుక......

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఒక కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీని కోసం రూ.3.5 కోట్ల మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కారును జర్మనీ నుండి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక పర్యటనకు ర

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (12:49 IST)
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఒక కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీని కోసం రూ.3.5 కోట్ల మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కారును జర్మనీ నుండి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక పర్యటనకు రాష్ట్రపతి వచ్చినప్పుడు దీన్ని వినియోగిస్తారు. రాష్ట్ర పరిపాలనా విభాగం మరియు ఇంటెలిజెన్స్ విభాగం కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాయి.
 
ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం. ప్రమాదాలను ముందుగానే గుర్తించి, సమాచారాన్ని తెలియజేసే సాంకేతిక పరిజ్ఞానం ఉండటం ఈ కారు ప్రత్యేకత. ఇందులో రక్షణ కోసం 7కుపైగా ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కోణంలో పనిచేసే రహస్య కెమెరాలు ఉంటాయి. సులభంగా డ్రైవింగ్ చేసే విధంగా ఇంటెలిజెన్స్ డ్రైవింగ్ సిస్టమ్, టచ్ స్క్రీన్ ఇందులో అదనపు ప్రత్యేకతలు.
 
త్వరలోనే ఈ కారును జర్మనీ నుండి బెంగుళూరుకు తీసుకురానున్నారు. ఈ కారు పూర్తిగా ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో ఉంటుంది. దీన్ని రాష్ట్రపతికి మాత్రమే కాకుండా ఉప రాష్ట్రపతి, ప్రధాని మరియు ఇతర దేశాల అధ్యక్షుల పర్యటనల కోసం కూడా వినియోగించే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments