Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ అరెస్ట్

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (22:46 IST)
కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేష్‌‌కు జాతీయ దర్యాప్తు సంస్ధ ప్రత్యేక కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కరోనా నేపద్యంలో ప్రత్యేకంగా వీరిని కోవిడ్ టెస్టుల అనంతరం వచ్చేన రిపోర్టు ఆధారంగా ఎన్ఐఏ తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తుంది. స్వప్న సురేష్ కోసం గాలిస్తున్న తరుణంలో ఈమేను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ బెంగళూరులో అదుపులోకి తీసుకుంది.
 
ఈ కేసులో ఇది రెండో అరెస్టు. స్వప్న సురేష్‌తో పాటు సందీప్ నాయర్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. స్వప్న సురేష్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళితే
 తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ కాన్సులేట్‌కు చెందిన పార్శిల్లో 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. దీంతో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ నిందితురాలుగా గుర్తించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి పలు ఆరోపణలు రావడంతో కేరళ సీఎం పినరయి విజయన్‌ ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంతో జాతీయస్థాయి కేసుగా మారి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో స్వప్న సురేష్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ వేగవంతం చేసి కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments