Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ ముస్లిం దర్గాల్లో హిందూ వివాహం.. మతసామరస్యానికి ఇదే నిదర్శనం

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (10:16 IST)
మత బేధం లేకుండా ముస్లిం పెద్దలు వ్యవహరించారు. వివాహాన్ని మసీదులోనే ఘనంగా నిర్వహించారు. తన బిడ్డకు పెళ్లి చేసే స్థోమత లేకపోవడంతో ఆ పేద ఆడబిడ్డకు ముస్లిం పెద్దలు వివాహం చేశారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన బిడ్డ వివాహం చేసే స్తోమత లేదని.. సహకరించాలని ఓ పేద తల్లి చేసిన విజ్ఞప్తికి ముస్లిం మత పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్గాలోనే ఆ పేద తల్లి విజ్ఞప్తిని నెరవేర్చారు. కేరళలోని చెరుపల్లి జమాత్ మసీదులో ఆదివారం జరిగింది. 
 
ఈ పెళ్లికి ముస్లిం మత పెద్దలు వధువు అంజుకు పది సవర్ల బంగారాన్ని కానుకగా అందజేశారు. ఇంకా వరుడు శరత్ కు రెండు లక్షల రూపాయల కట్నం ఇచ్చారు.  వివాహం అనంతరం పూర్తి శాకాహార విందును ఏర్పాటు చేయగా, పలువురు బంధుమిత్రులు, ముస్లిం పెద్దలు హాజరై, యువ జంటకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశామని మసీదు కమిటీ కార్యదర్శి నుజుముద్దీన్ అలుమ్మూట్టిల్ వ్యాఖ్యానించారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాష్ట్రంలో వెల్లివిరిసిన మత సామరస్యానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments