Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ రాజకీయాలు నవ్వు నవ్వు.. కేంద్రానికి బానిసగా మారిన సర్కారు: ఖుష్బూ ఫైర్

తమిళనాడు రాజకీయాలపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ కూడా చెన్నై రాజకీయాలపై ఫైర్ అయ్యారు. పార్టీలు విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌ల‌వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో త‌మ

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (09:54 IST)
తమిళనాడు రాజకీయాలపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ కూడా చెన్నై రాజకీయాలపై ఫైర్ అయ్యారు. పార్టీలు విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌ల‌వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో త‌మిళ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం వెర్రివాళ్ల‌ను చేస్తోంద‌ని కమల్ హాసన్ ట్వీట్ చేసిన తరుణంలో... తమిళ రాజకీయాలను చూసి ప్రపంచం నవ్వుతోందని అన్నారు. నాలుగేళ్లు కేంద్రానికి తమిళనాడు సర్కారు బానిసగా ఉంటుందన్నారు.
 
బీజేపీ ఒత్తిడితోనే పన్నీరు, పళని వర్గాలు విలీనమయ్యాయని, అన్నాడీఎంకే వర్గాల విలీనంలో ఆశ్చర్యపడాల్సిందేమీలేదని ఖుష్బూ వ్యాఖ్యానించారు. పన్నీర్‌ సెల్వం, పళనిస్వామికి వేరే అవకాశం లేక విలీనమయ్యారని తేల్చిచెప్పారు. నిన్నటి దాకా తిట్టుకున్న నేతలు ఇప్పుడెలా ఏకమయ్యారని ప్రశ్నించారు. 
 
ఈ విలీనం వల్ల ప్రజలకు ఒరిగేదేముందో చెప్పాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో అడుగు పెట్టేందుకు బీజేపీకి ఎలాంటి అవకాశం లేకపోవడం వల్లే ఇలాంటి రాజకీయాల ద్వారా పాగా వేయాలని కుయుక్తులు పన్నుతోందని ఖుష్బూ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments