Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్షద్వీప్ ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు జైలుశిక్ష

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (11:06 IST)
లక్షద్వీప్ లోక్‌సభ స్థానం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్‌ ఓ హత్యాయత్న కేసులో దోషిగా తేలారు. దీంతో ఆయనకు కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. ఇదే కేసులో మరో నలుగురిని కూడా దోషులుగా తేల్చింది. వీరందరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గత 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్‌ను హత్య చేయడానికి మరో నలుగురితో కలిసి ఫైజల్ ప్రయత్నించారన్నది ప్రధాన అభియోగం. దీనిపై విచారణ జరిపిన కోర్టు నిందితులంతా హత్యాయత్నానికి ప్రయత్నించి విఫలైనట్టు కోర్టు తేల్చింది. దీంతో వీరందరినీ దోషులుగా ప్రకటించింది. 
 
మరోవైపు, కోర్టు తీర్పు నేపథ్యంలో వీరిని కేరళ రాష్ట్రంలోని కున్నూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, హత్యాయత్న కేసులో మహ్మద్ దోషిగా తేలడంతో ఆయనపై లోక్‍సభలో అనర్హత వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments