Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాణా కుంభకోణం కేసు: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తప్పలేదు. ఈ కేసులో రాంచీ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బీహార్ రాష్ట్రం దాణా కుంభకోణం నాలుగో కేసుపై విచారణ జరిప

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (12:28 IST)
దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తప్పలేదు. ఈ కేసులో రాంచీ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బీహార్ రాష్ట్రం దాణా కుంభకోణం నాలుగో కేసుపై విచారణ జరిపిన కోర్టు లాలూకి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 
 
1995, 1996 సంవత్సరాల్లో దుంకా ట్రెజరీ నుంచి 3.13 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసినట్లు విచారణలో తేలపడంతో పాటు ఇప్పటికే లాలూని దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఇందులో భాగంగా మార్చి 24 (శనివారం) ఏడేళ్ల శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇప్పటికే పూర్తయిన మూడు కేసుల్లోనూ లాలూకి శిక్ష పడింది. 
 
ప్రస్తుతం లాలూ జైలు జీవితం అనుభవిస్తున్నారు. మొదటి కేసులో ఐదేళ్లు, రెండో కేసులో మూడున్నర ఏళ్లు, మూడో కేసులో ఐదేళ్ల శిక్ష పడింది. నాలుగో కేసులో మాత్రం ఏడేళ్ల శిక్ష పడింది. ఇకపోతే, లాలూతో పాటు దాణా కుంభకోణం కేసులో మరో 31 మంది నిందితులుగా ఉన్నారు. బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం ఈ కేసులో నిర్ధోషిగా తేలారు. ఈ కేసులోనూ లాలూ దోషిగా తేలడంతో ఆయన ఇక ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments