Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఓడిద్దాం: సోనియా గాంధీ

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:36 IST)
దేశ రక్షణ కోసం నిత్యం శ్రమిస్తున్న వైద్యులు, పోలీసులు, ఇతర అత్యవసర సిబ్బందిని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొనియాడారు. ఈ మేరకు సోనియా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

కొవిడ్​-19పై పోరులో ప్రజలకు కాంగ్రెస్​ సహకరిస్తుందని, ప్రజల వెన్నంటే ఉంటుందని తెలిపారు. అతి త్వరలోనే వైరస్​ను అంతమొందించడంలో దేశం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశరక్షణకు పాటుపడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర సేవల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సేవల కంటే గొప్ప దేశభక్తి ఏముంటుందని కొనియాడారు.

వారి స్ఫూర్తిని తీసుకొని మరింత ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఐక్యతాభావంతో ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఓడిద్దాం అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని ఓడించేందుకు దేశ ప్రజలు చూపుతున్న తెగువ, సహనానికి సోనియా కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్న కాసేపటి ముందు సోనియా ఈ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments