Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. పెళ్లై పిల్లలున్నా ''లవ్'' చిగురించింది..

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:06 IST)
ప్రేమకు కళ్లు లేవు గుడ్డిది అంటారు. అయితే కళ్లు మాత్రమే కాదు వయసుతో కూడా సంబంధం లేదని.. ఈ జంట నిరూపించారు. వివాహమైనా... ఇద్దరు పిల్లలు కలిగినా.. ఆపై వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కానీ ఆ ప్రేమకు సమాజం అక్రమ సంబంధం అని పేరు పెట్టడంతో పాటు.. నానా రకాలుగా మాటలతో దెప్పిపొడిచింది. చివరికి తమ ప్రేమను బతికించుకునేందుకు ఆ ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవసరి జిల్లా బిలిమొర ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సురిబుజర్గలో 25 ఏళ్ల రంజిత్ జుగ తన కుటుంబంతో అమ్లాసద్ సొసైటీలో నివసిస్తున్నాడు. ఇదే సొసైటీలో స్వాతి భాలియా అనే మరో మహిళ కూడా భర్తతో కలిసి నివసిస్తుంది. రంజిత్, స్వాతిలకు ఇప్పటికే వివాహమైంది. ఇద్దరికీ పిల్లలున్నారు. 
 
ఈ నేపథ్యంలో రంజిత్, స్వాతి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పదినెలలుగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమాయాణం గురించి సొసైటీ మొత్తం తెలిసిపోయింది. అయితే ఇంట్లో వారు వారిద్దరికీ షరతులు పెట్టారు. 
 
కలుసుకోకూడదంటూ నిబంధనలు పెట్టారు. అయినా వారిద్దరి మధ్య ప్రేమ చెరిగిపోలేదు. చివరికి సమాజం మాత్రం వీరి ప్రేమను అర్థం చేసుకోలేదని మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments