పబ్జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపిన తనయుడు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (14:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పబ్జీ గేమ్ ఆడనివ్వలేదన్న కోపంతో కన్నతల్లిని తండ్రి రివాల్వర్‌తో కాల్చి చంపాడో తనయుడు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసేందుకు తన స్నేహితుడి సాయం కోరడమే కాకుండా అతిని ఐదు వేల రూపాయలను ఆఫర్ కూడా చేశాడు. ఈ దారుణం ఐదు రోజుల క్రితం జరిగింది. 
 
యూపీలోని లక్నోకు చెందిన సాధన (40) అనే మహిళకు 16 యేళ్ల బాలుడు ఉన్నాడు. పజ్ జీ మొబైల్ గేమ్ ఆడకుండా అడ్డుకుంది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ బాలుడు.. తల్లిని కాల్చి చంపాడు. మూడు తర్వాత తర్వాత మృతదేహం నుంచి దుర్వాస రావడంతో కోల్‌కతాలో పని చేస్తున్న ఆర్మీ ఉద్యోగి అయిన తన తండ్రికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆ బాలుడు వద్ద విచారణ జరపగా పబ్జీ గేమ్ ఆడొద్దని చెప్పడంతోనే కాల్చి చంపినట్టు అంగీకరించాడు. తల్లి మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తరలించేందుకు స్నేహితుడి సాయాన్ని కోరడమే కాకుండా  రూ.5 వేల నగదు కూడా ఆఫర్ చేశానని చెప్పాడు. పైగా, ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని రివాల్వర్‌తో స్నేహితుడిని కూడా బెదిరించాడు. దీంతో ఈ హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి మామిడి కాయలు తింటే 9 ఆరోగ్య ప్రయోజనాలు, ఏమిటి?

రాత్రి భోజనం ఆరోగ్యకరంగా వుండాలంటే ఈ సూత్రాలు పాటించాలి

ఓట్స్ తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తెలంగాణలో ప్రజలను వేధిస్తున్న ఊబకాయం సమస్య..

స్ట్రాబెర్రీలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments