Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి... నేతల నివాళులు

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (10:03 IST)
జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి వేడుకలు జనవరి 30వ తేదీన దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. సత్యం, అహింస మార్గాలే తన ఆయుధాలుగా ఎన్నుకుని బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేసిన మహోన్నత వ్యక్తి మన జాతిపిత. బ్రిటీష్ సామాజ్య పాలన నుంచి భారత్‌కు విముక్తి కలిగించిన నేత. ఈయన 74వ వర్థంతి వేడుకలు ఆదివారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు యావత్ భారతావని నివాళులు అర్పిస్తుంది. 
 
"అహింసే అత్యున్నత కర్తవ్యం. మనం దాన్ని పూర్తిస్థాయిలో సాధన చేయలేక పోయినా, దాన్ని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానవతా దృక్పథంతో హింసామార్గం నుంచి సాధ్యమైనత వరకు దూరంగా ఉండాలి" అంటూ మహాత్మా గాంధీ యావత్ ప్రజలకు అమూల్యమైన సందేశం ఇచ్చారు. 
 
గాంధీ వర్థంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంటరానితనంకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞలు చేశారు. 
 
కాగా, "సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అందించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు" అంటూ టీడీపీ నేత దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments