Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమైందో ఏమో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నాడు...

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (12:57 IST)
భార్యాభర్తల అనుబంధం, ఆప్యాయత ప్రస్తుత కాలంలో కనుమరుగు అవుతోంది. కష్టసుఖాలను కలిసి పంచుకుంటామని ఏడడుగులు వేశారు. ఎన్నో ఆశలతో దాంపత్య జీవితం మొదలు పెట్టారు. అంతలోనే ఏమైందో ఏమో.. భార్యను దారుణంగా హత్యచేసి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని సొడక్‌ గ్రామంలో బిపిన్‌, లలికి ఈ ఏడాది మే 24 న వివాహం జరిగింది. బిపిన్ కూలీపనులకు వెళ్తుంటాడు.
 
కొద్దీ రోజులుగా దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో.. భార్యను గొడ్డలితో నరికేసి.. అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం బిపిన్ తండ్రి ఇంట్లోకి వచ్చి చూడగా ఇద్దరు విగత జీవులుగా పడివున్నారు. 
 
దీంతో అతడు పోలీసులకు, లలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments