Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై అత్యాచారం, హత్య- నిందితుడికి మరణశిక్ష

సెల్వి
ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (12:06 IST)
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని మతిగరలో గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఒక వ్యక్తికి శనివారం జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది.
 
గతేడాది ఆగస్టులో 11వ తరగతి విద్యార్థినిపై తొలిసారి అత్యాచారం చేసి, ఆపై ఆమె తలను ఇటుకతో పగులగొట్టి దారుణంగా హత్య చేసిన కేసులో దోషిగా తేలిన మహ్మద్ అబ్బాస్‌కు సిలిగురి సబ్-డివిజనల్ కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది.
 
గత ఏడాది ఆగస్టు 21న మతిగర ప్రాంతంలోని అడవుల్లోని ఓ గుడిసెలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారి తీసింది.
 
సాక్ష్యాధారాల ఆధారంగా దర్యాప్తు అధికారులు అబ్బాస్‌ను నిందితుడిగా గుర్తించి అతనిపై చార్జిషీటు దాఖలు చేశారు. అబ్బాస్‌పై లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ (IPS)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
కోర్టులో ఒక సంవత్సరం పాటు విచారణల తరువాత, నిందితుడికి శనివారం మరణశిక్ష విధించబడింది. అత్యాచారం, హత్య స్వభావం చాలా క్రూరంగా ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీర్పును స్వాగతించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం