Webdunia - Bharat's app for daily news and videos

Install App

దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అంటే ఇదే...

Webdunia
బుధవారం, 3 మే 2023 (15:23 IST)
దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అంటే ఇదే. పంజాబ్ రాష్ట్రంలో చిరునామా చెప్పలేని ఓ అభాగ్యుడికి రూ.2.50 కోట్ల లాటరీ తగిలింది. కానీ, ఆ సొమ్ము ఇపుడు ప్రభుత్వ ఖజానాకు వెళ్లనుంది. ఎందుకు ఎలా అనే విషయాలను పరిశీలిస్తే,
 
పంజాబ్ రాష్ట్రంలోని ఫాజిల్కా జిల్లాకు చెందిన సాక్ష్ అనే సామాన్య వ్యక్తి ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేయగా, దానికి రూ.2.50 కోట్ల లక్కీ డ్రా తగిలింది. అయితే, ఈ లాటరీ టిక్కెట్ కొన్న వ్యక్తి రెండు అక్షరాల పేరు మినహా తన చిరునామా, ఫోన్ నంబరు ఏదీ రాయలేదు. ఇపుడు ఈ లాటరీ టిక్కెట్‌కు లక్కీ డ్రా వచ్చినా ఆ డబ్బును ఆ అభాగ్యుడికి అందజేయలేని పరిస్థితి. దీంతో ఇపుడు ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు వెళ్లనుంది. 
 
కేవలం పేరు మాత్రమే రాస్తే గెలిచిన సొమ్ము పొందే అవకాశం ఉండదని, 249092 అనే నంబరు కలిగిన వ్యక్తి తాను గెలుచుకున్న డబ్బు కోసం రూప్‌చంద్ లాటరీ కంపెనీని సంప్రదించాలి. అతడు రాకపోతే ఆ సొమ్మును నేరుగా ప్రభుత్వం ఖజానాకు జమ చేస్తామని లాటరీ దుకాణం యజమాని తెలిపారు. ఆ వ్యక్తి చేసిన చిన్నపొరపాటు వల్ల రూ.2.50 కోట్లు గెలుచుకునే అవకాశం లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments