Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణకాష్టంలా మారిన మణిపూర్ - మహిళా మంత్రి ఇంటికి నిప్పు

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (12:53 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఆ రాష్ట్రం ఇపుడు రావణకాష్టంలా మారింది. దీంతో ఆందోళనకారులు ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పు అంటించారు. అదేసమయంలో ఈ ఘర్షణలను అణిచివేసేందుకు సాయుధ బలగాలు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. రాష్ట్రానికి చెందిన ఏకైక మహిళా మంత్రి ఇంటికి నిప్పు అంటించడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
రాష్ట్ర రాజధాని ఇంఫాల్ వెస్ట్ జిల్లా లాంఫెల్ ప్రాంతంలో ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి నెమ్చా కిప్గెన్ బంగళాను లక్ష్యంగా చేసుకుని దండుగులు బుధవారం సాయంత్రం నిప్పు పెట్టారు. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేకపోవడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ సీనియర్ అధికారుల నేతృత్వంలోని భద్రతా బలగాలు హుటాహుటిన మంత్రి నివాసానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఇంటికి నిప్పు పెట్టిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వంలోని 12 మంది మంత్రుల్లో కిప్గెన్ ఏకైక మహిళా మంత్రి. ప్రత్యేక పరిపాలనను డిమాండ్ చేస్తున్న 10 మంది కుకీ ఎమ్మెల్యేలలో కిప్గెన్ ఒకరు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments