Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందిరా గాంధీకి హడలెత్తించిన కరుణానిధి... జాతీయ జెండా ఎగురవేసిన తొలి సీఎం

కరుణానిధి ఓ ధిక్కార స్వరం, హక్కుల కోసం పోరాడిన యోధుడు. జాతిని ఏకతాటిపై తెచ్చిన ఓ మహా నాయకుడు.. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ప్రాధాన్యం, హక్కల కోసం కరుణానిధి గట్టిగా పోరాడారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆకాంక్షించేవారు. 1974 సంవత్సరం వరకూ స్

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (08:49 IST)
కరుణానిధి ఓ ధిక్కార స్వరం, హక్కుల కోసం పోరాడిన యోధుడు. జాతిని ఏకతాటిపై తెచ్చిన ఓ మహా నాయకుడు.. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ప్రాధాన్యం, హక్కల కోసం కరుణానిధి గట్టిగా పోరాడారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆకాంక్షించేవారు. 1974 సంవత్సరం వరకూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గవర్నర్లు మాత్రమే రాష్ట్రాల్లో జాతీయజెండా ఎగురవేసేవారు. 
 
ముఖ్యమంత్రలకు జెండా ఎగురవేసే సంప్రదాయం ఉండేది కాదు. దీనిని వ్యతిరేకించిన కరుణ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి ఘాటుగా ఓ లేఖ వ్రాసారు. దీనికి ప్రతి స్పందించిన రాష్ట్రాల్లో ఆగష్టు 15న ముఖ్యమంత్రులు, జనవరి 26న గవర్నర్లు జెండా ఎగురవేయాలని కేంద్రం ప్రకటించింది. దీంతో 1974 ఆగష్టు 15న ముఖ్యమంత్రిగా జెండా ఎగురవేశారు కరుణానిధి. 
 
అలా జాతీయ జెండా ఎగుర వేసిన తొలిముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రులకు జాతీయ జెండా ఎగురవేసే హక్కును సాధించిన యోధుడుగా కరుణానిధి చరిత్రలో నిలబడ్డారు. అంతేకాదు ఆయన తమిళనాడు కోసం ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments