Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓఎన్జీసీ హెలికాప్టర్ గల్లంతు.. నలుగురి మృతదేహాల వెలికితీత

ముంబైలోని జుహు నుంచి టేకాఫ్ అయిన ఓఎన్జీసీకి చెందిన ఓ హెలికాప్టర్ గల్లంతైంది. ముంబై సమీపంలో సముద్రంలోకి వెళ్లిన ఈ విమానం అదృశ్యమైంది. ఈ హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు ఓఎన్జీసీ ఉద్యోగులు ఉన్న

Webdunia
శనివారం, 13 జనవరి 2018 (15:22 IST)
ముంబైలోని జుహు నుంచి టేకాఫ్ అయిన ఓఎన్జీసీకి చెందిన ఓ హెలికాప్టర్ గల్లంతైంది. ముంబై సమీపంలో సముద్రంలోకి వెళ్లిన ఈ విమానం అదృశ్యమైంది. ఈ హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు ఓఎన్జీసీ ఉద్యోగులు ఉన్నారు. 
 
పవన్ హాన్స్‌‌కు చెందిన ఈ హెలికాప్టర్ ఉదయం 10.20 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయ్యింది. నింగికెగిరిన 15 నిమిషాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది. ముంబై హై నార్త్ ఫీల్డ్‌కు వెళ్తున్న సమయంలో ఇది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
 
ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయిన వెంటనే కోస్ట్ గార్డ్స్‌ను అప్రమత్తం చేశారని.. ఈ విమానం గల్లంతుపై గాలింపు కార్యక్రమాలు జరుపుతున్నట్లు ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నార్త్ ఫీల్డ్‌లో ఉదయం 10.58 గంటలకు చాపర్ ల్యాండ్ కావాల్సింది. 
 
అయితే హెలికాఫ్టర్ గల్లంతు కావడంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ హెలికాప్టర్ నీట మునిగిందని, ఇప్పటిదాకా నలుగురి మృతదేహాలను కోస్ట్ గార్డ్ సహాయక సిబ్బంది వెలికి తీశారు. మరో ఇద్దరి మృత దేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments