Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రిస్తున్న పిల్లని మంటల్లో వేసిన రాక్షసుడు...

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (12:43 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రాక్షసుడుగా మారిపోయాడు. హాయిగా నిద్రిస్తున్న పిల్లిని నిప్పుల్లో వేసి రాక్షసానందం పొందాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని భారతీ పార్క్ సమీపంలో ఉన్న నయా నగర్‌కు చెందిన సిద్ధేశ్ పటేల్ అనే వ్యక్తి.. సోమవారం అర్థరాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. 
 
ఆ సమయంలో మెట్ల కింద కొన్ని పిల్లులు హాయిగా నిద్రిస్తున్నాయి. వాటిని చూడగానే ఈ రాక్షసుడుకి ఓ వింత ఆలోచన మొదలైంది. దీంతో వాటిని ఓ బాక్సులో వేసి నిప్పు పెట్టాడు. మంటలకు తాళలేక పరిగెడుతుంటే మళ్లీ వాటిని పట్టుకుని మంటల్లో వేశాడు. కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మంటల్లో కాలిపోతుంటే వికృతానందం పొందాడు. 
 
అతను అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికి అపార్ట్‌మెంట్ వాసులు ఈ దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఈ చర్యను జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments