Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో వృద్ధుడికి ఆశ... రూ.కోటితో కి'లేడి' పరార్

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (08:29 IST)
పెళ్లి పేరుతో ఓ మహిళ ఒక వృద్ధుడిని మోసం చేసి, అతని వద్ద నుంచి కోటి రూపాయలతో పారిపోయింది. మోసపోయిన బాధితుడు ముంబయిలోని అంధేరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
 
ఈ కేసు గురించిన వివరాలను పోలీసులు వెల్లడిస్తూ, ముంబైలోని మలద్‌ ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల జెరాన్‌ డిసౌజా అనే వృద్ధుడు 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాడు. 
 
2019లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. దానిపై వడ్డీ రూపంలో వచ్చిన మొత్తంలో కొంత నగదును ఉపసంహరించుకున్నాడు. అయితే, అదే బ్యాంక్‌లో పనిచేస్తున్న షాలిని ఈ విషయం పసిగట్టింది. జెరాన్‌ డిసౌజా ఉపసంహరించుకున్న డబ్బుపై కన్నేసిన షాలిని.. ఆ వృద్ధుడితో పరిచయం పెంచుకుంది. 
 
వృద్ధాప్యంలో తోడుగా ఉంటానని ఒట్టేసింది. వివాహం చేసుకుంటానని మాటిచ్చింది. దీంతో ఇద్దరు కలిసి రెస్టారెంట్లకు, షికార్లకు తిరిగారు. ఆ తర్వాత తనొక వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందులో పెట్టుబడి పెట్టాలని జెరాన్‌ను కోరింది. 
 
లాభాలు చెరి సగం తీసుకుందామని నమ్మబలికింది. కాబోయే భార్యే కదా అని పెట్టుబడి కింద రూ.1.3కోట్ల డబ్బును 2020 డిసెంబర్‌లో షాలిని బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. 
 
అంతే, నగదు తన అకౌంట్లో పడగానే షాలినీ తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకుంది. జెరాన్‌ ఆమెను కలుసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాడు. దీంతో మోసపోయాయని తెలుసుకున్నాడు. గత డిసెంబర్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్‌ నీల్‌ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌ విడుద‌ల‌ తేదీ ప్రకటన

ఆ కోలీవుడ్ హీరో అలాంటివారా? ఆ హీరోయిన్‌ను వాడుకుని వదిలేశారా?

Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య-శోభిత?

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments