Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగాలాండ్ పౌరులపై ఉద్దేశ్వపూర్వకంగా కాల్పులు!!

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (10:54 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్‌ రాష్ట్రంలోని మోను జిల్లా థిరు, ఒటింగ్ గ్రామాల్లో తీవ్రవాదులుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారు. అలాగే, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ పౌరులపై భద్రతా బలగాలు ఉద్దేశ్యపూర్వకంగానే కాల్పులు జరిపారంటూ స్థానికులు ఆరోణలు చేస్తున్నారు. 
 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిపేందుకు నాగాలాండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన సిట్ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో భద్రతా బలగాలు ఉద్దేశ్యపూర్వకంగానే కాల్పులు జరిపినట్టు వెల్లడైంది. 
 
దీంతో కాల్పులు జరిపిన 15 మంది సైనికులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరు చనిపోయిన మేజర్ కూడా ఉన్నారు. స్థానికులను గాయపర్చడం లేదా చంపివేయాలనే కారణంతోనే ఆర్మీ జవాన్లు ఈ కాల్పులకు తెగబడినట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments