Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ ఇండియా స్టేట్స్ కంటే పాకిస్థాన్ బెట్టర్ : నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (10:06 IST)
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేతగా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ప్రధాని అయిన సందర్భంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారు. దీనిపై స్వదేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. వీటిని తన వాగ్ధాటితో సిద్ధూ కౌంటర్ వేశారు. 
 
ఈ నేపథ్యంలో సిద్ధూ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోమారు వివాదాస్పదమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించడం కంటే పొరుగునున్న పాకిస్థాన్‌కు వెళ్లడమే మంచిదంటూ తూలనాడారు. 'పాకిస్థాన్‌ సంస్కృతికి, దక్షిణాది సంస్కృతికి చాలా తేడా ఉంది. తమిళంలో వణక్కం వంటి ఒకట్రెండు పదాలు తప్ప ఏమీ అర్థంకాదు. పాక్‌లో పంజాబీ, ఇంగ్లిషే మాట్లాడతారు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, పాక్‌ నిజంగానే కర్తాపూర్‌ సాహెబ్‌ గురుద్వారలోకి భారత సిక్కులకు ప్రవేశం కల్పిస్తే.. కౌగిలింతతోపాటు.. ఈసారి ముద్దు కూడా పెడతానంటూ ఆయన బాహాటంగా ప్రకటించారు. మంచి మాటల చమత్కారి అయిన నవజ్యోత్ సింగ్‌కు ఆ మాటలే ఇపుడు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments