Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ్రా హైవేపై దారుణం : ప్రముఖ వైన్ వ్యాపారి కారులో సజీవదహనం!!

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (09:19 IST)
ముంబై - ఆగ్రా హైవేపై దారుణం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త సజీవదహనమయ్యారు. మృతుని పేరు సంజయ్ షిండే. ప్రముఖ వైన్ వ్యాపారి. ద్రాక్ష ఎగుమతిదారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్సీపీ కీలక నేత. ఆయననను తన సొంత కారులోనే కాలిబూడిదయ్యారు. ద్రాక్ష తోటల కోసం పురుగు మందులను కొనుగోలు చేసేందుకు పింపాల్ గావ్‌కు ఆయన తన కారులో వెళుతున్న వేళ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ముంబై, ఆగ్రా హైవేపై బస్వంత్ టోల్ ప్లాజా సమీపంలో కారులో షార్ట్ సర్క్యూట్ అయిందని తెలిపారు. కారులో శానిటైజర్‌లు ఉండటంతో, మంటలు మరింతగా చెలరేగాయని, ఇదేసమయంలో సెంట్రల్ లాకింగ్ మెకానిజమ్ జామ్ కావడంతో, డోర్లు తీసుకుని ఆయన బయటకు రాలేకపోయారని తెలిపారు. 
 
కారు తగులబడి పోవడాన్ని గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వగా, ఫైర్ ఇంజన్ వచ్చి, మంటలను ఆర్పిందని, ఆ తర్వాతే కారులో ఉన్నది సంజయ్ షిండే అని తెలిసిందని అన్నారు. కాగా, నాసిక్ ప్రాంతంలో సంజయ్ ఎంతో పేరున్న వ్యక్తి. అటు వ్యాపారంలో, ఇటు రాజకీయాల్లోనూ రాణించారు. సంజయ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments