Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషి వినయ్ శర్మ సూసైడ్ అటెంప్ట్ ... ఉరిని తప్పించుకునేందుకేనా?

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (10:54 IST)
నిర్భయ అత్యాచారం కేసులో ఉరిశిక్షపడిన ముద్దాయిల్లో ఒకరైన వినయ్ శర్మ తీహార్ జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జైలు గోడకేసి తలను బాదుకోవడంతో తలకు గాయమైంది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి, చికిత్స చేస్తున్నారు. 
 
ఈ నెల 16న వినయ్‌ శర్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించిన విషయం విదితమే. 
 
మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రాణా సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. దోషులు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌కుమార్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ (31)పై కోర్టు డెత్‌ వారంట్‌ జారీచేయడం ఇది మూడోసారి. 
 
శిక్షను వాయిదా వేయించేందుకు దోషులు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో ఒక కొత్త పిటిషన్‌ దాఖలు చేస్తుండటంతో శిక్ష అమలు వాయిదా పడుతూ వస్తున్నది.  
 
కాగా, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన వారం రోజుల గడువు ముగిసిందని, దోషులకు సంబంధించి ఎటువంటి పిటిషన్‌ ఏ కోర్టులోనూ పెండింగ్‌లో లేదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌ మోహన్‌ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు మార్చి 3న నలుగురిని ఉరితీయాలని తాజా డెత్‌ వారంట్లు జారీ చేసింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments