Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత రక్తనమూనాలు మా వద్ద లేవు: అపోలో షాక్

బెంగళూరుకు చెందిన అమృత (37) అనే మహిళ తాను జయలలిత కుమార్తెనని.. డీఎన్ఏ టెస్టు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చే

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (17:00 IST)
బెంగళూరుకు చెందిన అమృత (37) అనే మహిళ తాను జయలలిత కుమార్తెనని.. డీఎన్ఏ టెస్టు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో అమృత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అమృత డీఎన్ఎ పరీక్ష కేసు మలుపు తిరిగింది.


ఈ అంశంపై అమృత దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణ జరుపుతోంది. 2016 జయమ్మ అనారోగ్యంతో 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో జయలలిత కుమార్తెనని అమృత నిరూపించుకోవాలంటే.. జయలలితకు సంబంధించిన బయోలాజికల్‌ నమూనాలు ఏవైనా సేకరించి ఉంచారా, లేదా అనే విషయంపై సమాచారం ఇవ్వాలని అపోలో ఆస్పత్రిని కోర్టు బుధవారం (ఏప్రిల్ 25) ఆదేశించింది.

కానీ అపోలో ఆస్పత్రి మాత్రం తమ వద్ద బయోలాజికల్ శాంపిల్స్ లేవని షాక్ ఇచ్చింది. ఇంతకుముందు.. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటి సీసీటీవీ దృశ్యాల గురించి కోరగా అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇదేవిధమైన సమాధానం చెప్పి అందర్నీ షాక్‌కు గురిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments