Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యం... మంచి నిర్ణయం తీసుకోండి.. శశి వర్గీయులకు ఓపీఎస్ లేఖ

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తన వైరివర్గం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులకు ఓ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (16:09 IST)
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తన వైరివర్గం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులకు ఓ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆయన ఈ లేఖ విడుదల చేశారు. 
 
పార్టీలో వివాదాలు తాత్కాలికమని, మనమంతా ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ విడిపోతుందని ప్రత్యర్థులు చూస్తున్నారని, ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందన్నారు. 
 
అమ్మ అసంపూర్తిగా మిగిల్చిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన లేఖలో తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పనులపై దృష్టి పెట్టాలని పన్నీర్ సెల్వం సూచించారు. ఏ పార్టీ మద్దతు, సహకారం లేకుండానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments