Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్ న్యూస్..

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (12:30 IST)
కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్ న్యూస్. కులాంతర వివాహాలను ప్రోత్సహించే దిశగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. కులాంతర వివాహాలు చేసుకునేవారు సర్కారు ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు సుమంగళ్ పేరిట ఓ వెబ్‌సైట్‌ను ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సుమంగళ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. 
 
కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఇచ్చే ప్రోత్సాహకం లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయలకు పెంచామని సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. గతంలో రూ.50వేలున్న అంతర్ కుల వివాహ ప్రోత్సాహకాన్ని 2017లో లక్షరూపాయలకు పెంచింది. ప్రస్థుతం దీన్ని రెండున్నర లక్షల రూపాయలకు పెంచింది. కులాంతర వివాహాలు సామాజిక సామరస్యానికి దోహదపడతాయని సీఎం చెప్పారు.
 
ఉన్నత కులానికి చెందిన వారు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిని హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకుంటే వన్ టైమ్ ప్రోత్సాహకం అందిస్తామని సర్కారు వెల్లడించింది. మొదటిసారి వివాహం చేసుకున్న వారికి మాత్రమే ఈ గ్రాంట్ ఇస్తామని, అయితే వధువు వితంతువు అయితే వారు ప్రోత్సాహకానికి అర్హులని సర్కారు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం