Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు తాగొద్దన్నాడనీ యజమానిని హత్య చేసిన సర్వెంట్

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (16:50 IST)
మద్యం తాగవద్దని నివారించినందుకు యజమానిని గొడ్డలితో నరికి చంపిన ఘటన మంగళవారం రాత్రి ఒడిశాలో జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఖుర్దా జిల్లా సిమోరొ గ్రామానికి చెందిన 35 ఏళ్ల సత్యబ్రత అనే యువకుడు ఊళ్లో కొత్త ఇల్లు కట్టాడు. అతని తల్లిదండ్రులు భువనేశ్వర్‌లోని పాత ఇంట్లో ఉంటున్నారు. మరో 20 రోజులలో పెళ్లి కావలసి ఉండగా, సత్యబ్రత ఇంటికి రంగులు వేయించాలని భావించాడు. 
 
రంగులు కొనుగోలు చేయాలని సత్యబ్రత ఆ ఇంట్లో పనిచేసే నరేంద్ర అనే వ్యక్తితో కలిసి కొత్త ఇంటికి వచ్చాడు. నరేంద్రకు మద్యం అలవాటు ఉంది. రోజూ రాత్రి తాగి అల్లరి చేసేవాడు. ఈ దురలవాటు మానివేయమని సత్యబ్రత నరేంద్రను అనేక సార్లు మందలించాడు కానీ వినకపోవడంతో చేయిచేసుకునేవాడు. రంగులు కొనుగోలు చేసి మంగళవారం రాత్రి వారిద్దరూ కొత్త ఇంట్లో నిద్రపోయారు. 
 
ఈ నేపథ్యంలో నరేంద్ర అర్ధరాత్రి లేచి సత్యబ్రత తలపై గొడ్డలితో నరికి చంపేశాడు. 'మద్యం తాగవద్దని అడ్డుపడినందుకు చంపేశాను' అని సుద్ద ముక్కతో గోడపై కారణాన్ని రాసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఖుర్దా పోలీసులు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఖుర్దా ఆసుపత్రికి తరలించారు, నరేంద్ర కోసం గాలింపులు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments