Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మాతాకి జై అన్నవారికే భారత్‌లో చోటు : కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (18:53 IST)
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో సహాయ మంత్రిగా ఉన్న కైలాశ్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకీ జై అన్నవారికే దేశంలో చోటు ఉంటుందన్నారు. ఆయన తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
భారత్‌లో ఉండాలనుకునేవారు తప్పకుండా భారత్ మాతాకీ జై అనాల్సిందేనని చెప్పారు. అలాగే, హైదరాబాద్ నగరంలో ప్రజాప్రతినిధులు వాడుతున్న  భాషపై ఆయన కామెంట్స్ చేశారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందేనని అన్నారు.
 
రాష్ట్రం (తెలంగాణ)లో జాతీయవాద ఆలోచనలతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. భారత్‌లో ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్ అంటారా? అని ప్రశ్నించారు. 'వందేమాతరం', 'భారత్ మాతా కీ జై' అన్న వారికే దేశంలో చోటు ఉంటుందని స్పష్టం చేశారు. 
 
'ఎవరైతే 'భారత్ మాతా కీ జై' అనరో, ఎవరికైతే హిందూస్థాన్ మీద, భారత్ మీద విశ్వాసం లేదో, ఎవరైతే 'పాకిస్థాన్ జిందాబాద్' అంటారో వారు పాకిస్థాన్ వెళ్లిపోవాల్సిందే. అలాంటి వారికి ఇక్కడ స్థానం లేదు' అని మంత్రి కైలాశ్ చౌదరి తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments