Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీగా చికెన్ ఇవ్వలేదంటూ కోళ్లను చంపేశారు.. ఎక్కడ...?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (18:39 IST)
ఇంట్లో పెంచుకుంటున్న కోళ్లను ఫ్రీగా ఇవ్వలేదని ఇద్దరు దుండగులు కోళ్లను చంపేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆదివారం నాడు చోటుచేసుకుంది.


ఝాన్సీ రోడ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గుడ్డి భాయ్‌ అనే మహిళ తన కుమార్తెతో నివసిస్తూ జీవనాధారం కోసం కూలీగా పని చేస్తోంది. కూలీ డబ్బులతో ఇంటి అవసరాలు తీరకపోయే సరికి ఇంటి వద్దనే నాలుగైదు కోళ్లను పెంచుకుంటుంది. 
 
కోళ్లు పెట్టిన గుడ్లను అమ్ముకొని.. ఆ డబ్బుతో చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటుంది. ఆదివారం ఉదయం గుడ్డి భాయ్‌ ఇంట్లో లేని సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చి, ఫ్రీగా ఓ కోడిని ఇవ్వాలని ఆమె కూతురిని కోరారు. ఆమె తిరస్కరించంతో కోపగించుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడున్న ఒక కోడి పుంజును చంపేశారు. మిగతా నాలుగు కోళ్లకు విషాహారం తినిపించారు. 
 
దీంతో ఒకేసారి ఐదు కోళ్లు చనిపోయాయి. చివరకు ఇంటికి చేరుకున్న గుడ్డి భాయ్ చనిపోయిన కోళ్లను తీసుకొని ఝాన్సీ రోడ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది‌. కోళ్లను చంపేసిన సురేందర్‌, సుమర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments