Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ తగ్గింపు వెనుక ప్రధాని మోడీ : రాజ్‌నాథ్‌

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కింద కొన్ని వస్తువులపై పన్ను తగ్గింపు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. జీఎస్టీ రేట్లు తగ్గింపుపై లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడ

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (06:41 IST)
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కింద కొన్ని వస్తువులపై పన్ను తగ్గింపు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. జీఎస్టీ రేట్లు తగ్గింపుపై లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జీఎస్టీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధాని గుర్తించారని, కొన్ని సవరణలను చేయాలని ఆయన సూచించారని చెప్పారు. 
 
ఫలితంగానే జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ కారణంగా 178 వస్తువులపై వసూలు చేస్తూ వచ్చిన 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గించారని గుర్తు చేశారు. ఈ జీఎస్టీ తగ్గింపుతో వర్తకులు, వ్యాపారులు ఆనందంగా ఉన్నారన్నారు. ప్రజల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. 
 
కాగా, ఇటీవల గౌహతిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో 178 వస్తువులపై 28 శాతంగా ఉన్న పన్నును 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ తగ్గింపు క్రెడిట్‌ రాహుల్‌కే దక్కుతుందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొనడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తర్వాతి కథనం
Show comments