Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ అంటే రాజకీయ నేతలే కాదు.. : మీడియాకు ప్రధాని క్లాస్

దేశీయ మీడియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లాస్ తీసుకున్నారు. భారత్ అంటే కేవలం రాజకీయ నేతలే కాదు.. 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలంతా ఎదుర్కొంటున్న సమస్యలు, అంశాలపై మీడియా దృష్టిసారించాలని ఆయన

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (14:33 IST)
దేశీయ మీడియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లాస్ తీసుకున్నారు. భారత్ అంటే కేవలం రాజకీయ నేతలే కాదు.. 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలంతా ఎదుర్కొంటున్న సమస్యలు, అంశాలపై మీడియా దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
సోమవారం తమిళ దినపత్రిక "దినతంతి" 75వ వార్షికోత్స వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎప్పుడూ రాజకీయాలేనా.. ఇండియా అంటే రాజకీయ నాయకులే కాదు.. ఇంకా చాలా ఉంది.. ఈ దేశంలో 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు.. మీడియా మిగతా అంశాలపైనా దృష్టి సారించాలి.. అంటూ పిలుపునిచ్చారు. 
 
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, న్యాయవ్యవస్థలాగే మీడియాకు కూడా ప్రజలకు జవాబుదారీగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శాంతి ద్వారా తప్ప బలప్రయోగం ద్వారా సంస్కరణలను తీసుకురాకుండా చేయడంలో మీడియాదే ప్రధాన పాత్ర అని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. 
 
ప్రస్తుతం మీడియా అంతా రాజకీయాల చుట్టే తిరుగుతోందని, భారత్ అంటే రాజకీయ నేతలే కాదు. దాని కంటే చాలా పెద్దది. 125 కోట్ల ప్రజలు ఉన్నారని గుర్తు చేశారు. మీడియా మిగతా అంశాలపై దృష్టిపెడితే తాను చాలా సంతోషిస్తానని అన్నారు.
 
ప్రజా ప్రయోజనాల కోసమే మీడియా తమ వాక్ స్వాతంత్య్రాన్ని ఉపయోగించాలి. రాసే స్వాతంత్య్రం ఉంది కానీ.. తప్పుడు వార్తలు రాసే స్వాతంత్య్రం మాత్రం లేదన్నారు. ప్రస్తుతం మానవాళికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పులను మీడియా బాగా హైలైట్ చేయాలని మోడీ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు పెరిగిపోతున్నాయి. 
 
వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందా? వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో మనమేం చేయాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీడియా కృషి చేస్తుందా? అని ప్రధాని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రెస్‌ను నాలుగో స్తంభంగా పరిగణిస్తారు. మీడియా ఖచ్చితంగా ఓ శక్తే. అయితే దానిని దుర్వినియోగం చేయకూడదు అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments