Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ వల్లే శరద్ పవార్ ప్రధాని కాలేకపోయారు : ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (14:49 IST)
కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల వల్ల ప్రతిపక్షాలలోని ప్రతిభావంతులైన నేతలు కూడా తగిన స్థానం పొందడంలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ప్రధాని కాకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఈ మేరకు మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీల సమావేశంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై మోడీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తన స్వార్థ రాజకీయాలే తప్ప ఇతరులు, దేశ ప్రయోజనాలపై పట్టింపులేదని మండిపడ్డారు. కాంగ్రెస్ రాజకీయాలతో ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటి నేతలు ప్రధాని పీఠంపై కూర్చోలేకపోయారని మోడీ విమర్శించారు. ఇకపైనా పవార్ ప్రధాని అయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పారు.
 
ఇలాంటి నేతలంతా ఎంతో సమర్థులేనని, ప్రధాని పదవికి అర్హులేనన్న విషయం అందరికీ తెలుసని చెప్పారు. ఎన్డీయే కూటమిలో మాత్రం అలాంటి స్వార్థ రాజకీయాలకు చోటులేదని మోడీ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. కూటమిలో మిత్రపక్షాలు, వారి ప్రయోజనాలు కూడా తమకు ముఖ్యమేనని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని మోడీ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments