Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఉప‌వాస దీక్ష‌

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం దీక్ష చేయనున్నారు. గురువారం రోజంతా పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేయనున్నారు. ఇంత‌కీ ఈ దీక్ష ఎందుకంటే.. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను ప్

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (09:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం దీక్ష చేయనున్నారు. గురువారం రోజంతా పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేయనున్నారు. ఇంత‌కీ ఈ దీక్ష ఎందుకంటే.. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేసినందుకు నిరసనగా ఈ ఉపవాస దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ ఎంపీలతో కలిసి ఆయన ఈ దీక్ష చేయనున్నారు. 
 
అయితే, ఆయ‌న దీక్ష చేసినా.. రోజువారీ విధులకు ఆటంకం కలగకుండానే ఆయన చేస్తారని, ఫైళ్ల క్లియరెన్స్‌ యధావిధిగా ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే కర్ణాటకలోని హుబ్లీ పర్యటనలో ఉండనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా అక్కడే తన ఉపవాస దీక్షను కొనసాగించనున్నారు. 
 
పార్లమెంటును కాంగ్రెస్‌ స్తంభింపజేసినందుకు నిరసనగా ఈనెల 12వ తేదీన బీజేపీ ఎంపీలు ఉపవాస దీక్ష చేస్తారని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, తాను కూడా దీక్షలో కూర్చుంటున్నానని మంగళవారం ఆయన ప్రకటించారు. ఇక, బీజేపీ ఎంపీలంతా వారి నియోజకవర్గాల్లో ఈ దీక్షలో పాల్గొననున్నారు. మ‌రి.. ప్ర‌ధాని దీక్ష గురించి ప్ర‌తిప‌క్షం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments