Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న ప్రధాని మోదీ...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (10:07 IST)
భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ తొలిసారిగా తిరుమలకు రానున్నారు. ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు బయలుదేరుతారు. తిరుమల కొండపైకి చేరుకున్నాక మోడీ పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. 
 
అక్కడి నుంచి నేరుగా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు రేణిగుంట నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. 
ప్రధాని పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఏర్పాట్లు ప్రారంభించాయి. ప్రధాని పర్యటన ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. 
 
మరోవైపు మోడీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఏపీ బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ వి. మురళీధరన్ నివాసంలో రాష్ట్రనేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీ నారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు ఈ భేటీలో పాల్గొని ప్రధాని తిరుమల పర్యటన, ఇతర అంశాలపై చర్చించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments