Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో ఏటీఎం మెషీన్... ఏంటి సంగతి?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (16:48 IST)
బీహార్‌ రాష్ట్రంలోని బోథ్‌గయకు చెందిన ధర్మారణ్య సమీపంలో ఒక కారు అనుమానాస్పద స్థితిలో కనిపించింది. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. కారు రోడ్డు మధ్యలో టైరు ఫంక్చరై ఆగిపోయి కనిపించడంతో తీవ్రవాదులు ఎవరైనా ఇలా చేసివుంటారని అనుమానించారు. సమాచారాన్ని పోలీసులకు అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కారుని పరిశీలించి దానిలో ఏటిఎం మెషిన్ ఉందని కనుగొన్నారు.
 
కొందరు ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... అగంతకులు ఏటిఎంని కారులో వేసుకుని వెళుతుండగా టైరు పంక్చర్ కావడంతో జనానికి భయపడి అక్కడే వదిలి వెళ్లి ఉండవచ్చొని అన్నారు. కారుని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించగా ఈ ఏటిఎం ఘుఘరీటాండ్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినదిగా గుర్తించారు. 
 
ఇది విష్ణుపథ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉందని, టైరు పేలడంతో జనాలు వచ్చేలోగా కారు వదిలి దుండగులు పరారయ్యారని పోలీసులు భావిస్తున్నారు. వారు ఏటిఎంని చోరీ చేసి తరలించడానికి ఉపయోగించిన గ్యాస్‌కట్టర్‌లను కూడా కారులో పోలీసులు కనుగొని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న దుండగులను పట్టుకోవడానికి చర్యలను ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments