Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై సామూహిక అత్యాచారం.. రెండు వేల రూపాయలు చేతిలో పెట్టి..?

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (13:27 IST)
బాలికపై పోలీసులే అకృత్యానికి పాల్పడ్డారు. ఓ బాలికపై మూడు నెలలు పోలీస్ స్టేషన్‌లో సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. లాక్‌డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేక దిక్కులు చూస్తున్న బాలికకు సాయం చేస్తామని చెప్పి అత్యాచారకాండ సాగించారు. 
 
మూడునెలలు అమ్మాయికి నరకం చూపించారు. ఈ క్రమంలో బాధితురాలికి గర్భం రావడంతో అబార్షన్ చేయించి, ఎవరికీ చెప్పొద్దంటూ రెండువేలు చేతిలో పెట్టి పంపారు. ఈ ఘటన ఒడిశాలోని సుందర్ గడ్‌ జిల్లాలోని బీరమిత్రపూర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..13 ఏళ్ల బాలిక రోడ్డుపై ఒంటరిగా కనిపించడంతో బీరమిత్రపూర్ పోలీసులు ఆమె స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇన్‌చార్జి ఆనంద చంద్ర మఝి అత్యాచారం చేశాడు. తర్వాత ఆమె బెదిరించి ఇంట్లో వదిలేశారు. 
 
రోజూ పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. బాలిక పెంపుడు తండ్రి భయపడిపోయి అమ్మాయిని అలాగే చేయాలన్నాడు. బాధితురాలు ప్రాణభయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. మూడు నెలల పాటు స్టేషన్ సిబ్బంది వంతుల వారీగా ఆమెపై ఘోరానికి పాల్పడ్డారు. ఇంకా నిందితులైన పోలీసులను సస్పెండ్ చేశారు. 
 
విషయం తెలుసుకున్న మరో ఇద్దరు యువకులు కూడా కాటేశారు. అనారోగ్యం పాలైన బాలికను ఈ నెల 16 ఆస్పత్రికి తరలించగా గర్భం దాల్చినట్లు తేలింది. పోలీసులు డాక్టర్లను బెదిరించి గర్భస్రావం చేయించారు. మహిళా సంక్షేమ సంఘం జోక్యంతో ఈ ఘటనపై కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments