Webdunia - Bharat's app for daily news and videos

Install App

విస్తారా ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (13:41 IST)
విస్తారా ఎయిర్‌లైన్స్‌‍కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తాజాగా శుక్రవారం ఉదయం దిల్లీ నుంచి పుణె బయల్దేరిన విస్తారా ఎయిర్‌లైన్స్‌ విమానంలో బాంబు ఉందంటూ ఫోన్‌ రావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానం మొత్తం తనిఖీలు చేశారు. బాంబు లేదని నిర్దారించుకున్న తర్వాత విమానం ఆలస్యంగా బయల్దేరినట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. 
 
'ఈ రోజు ఉదయం దిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఉన్న జీఎంఆర్‌ కాల్‌ సెంటర్‌కు ఢిల్లీ - పుణె విస్తారా విమానంలో బాంబు ఉందని ఫోన్‌ వచ్చింది. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశాం. భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానంలో ఎలాంటి బాంబును గుర్తించలేదు' అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. దీనిపై విమానాశ్రయ సిబ్బంది దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments